15 సెకెండ్స్లోనే యూఏఈ ఎంట్రీ పర్మిట్
- November 21, 2018
యూ.ఏ.ఈ:ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా కేవలం 15 సెకెండ్లలోనే ఎంట్రీ పర్మిట్స్ కోసం అప్లయ్ చేసుకునే అవకాశం కలుగుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) వెల్లడించింది. కొత్త స్మార్ట్ సిస్టమ్ ద్వారా 5 మిలియన్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ టైమ్లో పూర్తి చేయగలదని అధికారులు వివరించారు. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, అప్లికెంట్స్ అథారిటీకి చెందిన స్మార్ట్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ వెంటనే డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి, అక్కడికక్కడే వీసాల్ని మంజూరు చేస్తుంది. ఏడాదిగా ఈ సిస్టమ్ని తాము పరీక్షిస్తున్నామనీ, పూర్తిస్థాయి యాక్యురసీతో ఈ సిస్టమ్ పనిచేసిందని అధికారులు వివరించారు. మెడికల్ సర్టిఫికెట్ బేస్డ్ రికార్డ్స్ని చెక్ చేయడానికి గతంలో 4 నుంచి 6 గంటల సమయం పట్టేదనీ, అది ఇప్పుడు కేవలం 15 సెకెండ్లలో పూర్తయిపోతుందని కల్నల్ డాక్టర్ ఒమర్ అలి సయీద్ అల్ షామ్సి చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







