దుబాయ్:టీ10 క్రికెట్ లీగ్ లో సందడి చేయనున్న ఊర్వశి రౌతెలా
- November 21, 2018
దుబాయ్లో టీ10 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో 2015 మిస్ దివా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా సందడి చేయబోతోంది. దీనికి పారితోషికంగా ఆమె రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఒక్క షోకు అంత భారీ పారితోషికమా? అని బాలీవుడ్లో చాలా మంది షాక్ అవుతున్నారు. దుబాయ్ పార్క్ అండ్ రిసార్ట్స్లో లీగ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఊర్వశితోపాటు ప్రముఖ గాయకుడు ఆతిఫ్ అస్లామ్, నటి మహీరా ఖాన్ కూడా ప్రదర్శన ఇస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక షో చూడాలనుకుంటే రూ.2 వేలు పెట్టి టికెట్టు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







