ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం

- December 23, 2015 , by Maagulf
ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో అయుత మహా చండీయాగం బుధవారం ఉదయం ప్రారంభమైంది. నిర్ణయించిన ముహుర్తమైన 8.30నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. రుత్వికులు, బ్రాహ్మణులు, నిర్వాహకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. యాగశాలకు వచ్చిన ఆయనకు వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రుత్వికులతో కలిసి ముఖ్యమంత్రి దంపతులు యాగశాల ప్రదక్షిణ చేశారు. యాగస్థలికి చేరుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ దంపతులకు సీఎం దంపతులు స్వాగతం పలికారు. గురు ప్రార్థనతో చండీమాత విగ్రహం ముందు మొదటిరోజు కార్యక్రమం ప్రారంభమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com