క్రైస్తవులకు కానుకగా..నవ్యాంధ్రలో క్రైస్తవ భవన్

- December 23, 2015 , by Maagulf
క్రైస్తవులకు కానుకగా..నవ్యాంధ్రలో క్రైస్తవ భవన్

 

నవ్యాంధ్రలో క్రైస్తవ భవన్ గుంటూరు సమీపంలోని అడవితక్కెళ్లపాడులో ఏర్పాటు కానుంది. మంత్రి రావెల కిషోర్‌బాబు చొరవతో ఈ భవనం నిర్మాణం జరగనుంది. ఇందులోనే క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయం కూడా ఏర్పాటవుతుంది. క్రైస్తవులకు శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలు జరుపుకోవడానికి భవిష్యత్తులో ఇదొక కీలకమైన వేదిక కానుంది. అలానే జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవులు బస చేసేందుకు కూడా ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఈ భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. క్రైస్తవ భవన్ నిర్మాణానికి బడ్జెట్‌ నుంచి రూ. 10 కోట్లను విడుదల చేయించారు. ఈ భవనం కోసం ఎన్నాళ్లుగానో క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ మంగళవారం సాకారం కాబోతోంది. శంకుస్థాపన అనంతరం ఇక్కడే సెమీక్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి క్రైస్తవ సంఘాల మతపెద్దలు గాలిబాలి, అబ్రహం, శామ్యూల్‌, గోవాడ దైవ ఆశీర్వాదం, వెస్లీ, స్టీఫెన బల్గర్‌, జానవెస్లీ, అంతర్జాతీయ గాయకులు పాల్గొంటారు. అలానే వేడుకలు అనంతరం సంఘ సేవకులను ఘనంగా సత్కరిస్తారు. మతపెద్దలకు గౌరవ విందును కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com