ఆధార్ డేటాను ఉపసంహరించుకొనే వెసులుబాటు!
- December 06, 2018ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటా ఉపయోగించుకొనేందుకు వీలు కల్పిస్తోన్న ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను కొట్టేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు సంస్థలు.. వ్యక్తుల ఆధార్ డేటాను తీసుకోవడం రాజ్యాంగ బద్ధం కాదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆధార్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. సుప్రీం ధర్మాసనం ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. కొందరు వ్యక్తులు తమ ఆధార్ సంఖ్య, బయోమెట్రిక్ వంటి వివరాలను గతంలో ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. అయితే ఈ వివరాలను వెనక్కి తీసుకునే వెసులుబాటుపై ప్రభుత్వం సవరణలు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను భారత విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రూపొందించింది. 18 ఏళ్ల వయసు దాటినవారికి అంతకుముందు ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఆధార్ వివరాలను ఉపసంహరించుకొనేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని యూఐడీఏఐ ప్రతిపాదించింది. కాగా సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ ను అనుసంధానించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు సమయంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే పాన్ కార్డుకు మాత్రం ఆధార్ అనుసంధానాన్ని సమర్థించింది.
తాజా వార్తలు
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త