న్యూయార్క్లో బాంబు కలకలం, నిలిచిపోయిన సిఎన్ఎన్ ప్రసారాలు
- December 07, 2018న్యూయార్క్ : న్యూయార్క్లోని టైమర్ వార్నర్ సెంటర్ బిల్డింగ్లో ఐదు బాంబులను అమర్చినట్లు ఓ ఫోన్కాల్ రావడంతో అక్కడ సమీపంలోని కేబుల్ న్యూస్ నెట్వర్క్(సిఎన్ఎన్) ప్రసార కార్యాలయాల భవనాన్ని పోలీసులు గురువారం రాత్రి ఖాళీ చేయించారు. దీంతో ప్రసారాలకు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు తెలిపారు. ఈ బాంబు కలకలంతో సమీపంలోని భవనాలను ఖాళీ చేయించామని, గాలింపు చర్యలు చేపట్టినట్లు న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్ తెలిపారు. బాంబ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను, పాదచారులరు సైతం తనిఖీ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో కాల్ వచ్చిందని, దీంతో న్యూస్ చానల్ ప్రసారాలను నిలిపివేసి, భవనం నుండి ఉద్యోగులను సురక్షితంగా వెలుపలకు పంపించామని తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ