ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసిన కేంద్రం

- December 18, 2018 , by Maagulf
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేసిన కేంద్రం

న్యూడిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజీని ఇప్పటికే ప్రకటించినట్లు కేంద్రం తెలిపింది. ప్రత్యేక హోదాపై టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం రాజ్యసభలో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్రం ఏపీకి హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని చెప్పింది. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమల్లో లేదని కేంద్రం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com