రిషబ్ చిట్ఫండ్ యజమాని అరెస్టు
- December 20, 2018హైదరాబాద్: చిట్టీల పేరుతో ఖాతాదారుల నుంచి సుమారు రూ. 200 కోట్లు వసూలు చేసి పరారైన రిషబ్ చిట్ఫండ్ యజమానిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ గుజ్జర్, అతని భార్య నందినిని బోయగూడలోని వారి నివాసంలో గురువారం అదపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్లోని రిషబ్ చిట్ఫండ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారిద్ధరి సమక్షంలోనే సుమారు మూడు గంటల పాలు కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు నిమిత్తం వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారి అరెస్టు సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున శైలేష్ నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..