ద్రాక్ష పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు..
- December 21, 2018
ఈ కాలంలో ద్రాక్ష పండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ద్రాక్ష పండ్లంటే నచ్చని వారుండరు. ద్రాక్ష పండ్లలో పలురకాలున్నాయి.. నలుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో లభిస్తాయి. ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచుగా వీటిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
1. చాలామంది తరచు నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అలాంటివారు.. రాత్రివేళలో కప్పు ద్రాక్ష పండ్లు సేవిస్తే సమస్య తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
2. ద్రాక్ష పండ్లను మెత్తని పేస్ట్లా చేసుకుని అందులో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే కడుపులోని మంట తగ్గుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాస్ ద్రాక్ష పండ్ల రసాన్ని సేవిస్తే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
3. ద్రాక్ష తొక్కలను బాగా ఎండబెట్టుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తరచు పాలలో కలిపి తాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్తున్నారు వైద్యులు.
4. ద్రాక్ష పండ్ల గుజ్జును వేరుచేసుకోవాలి. అందులో స్పూన్ మోతాదులో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై గల నల్లటి ఛారలు, వలయాలు పోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా, తాజాగా మారుతుంది.
5. ద్రాక్ష పండ్లలోని విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. ద్రాక్ష పండ్లను ప్రతిరోజూ సలాడ్ రూపంలో ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!









