శివాజీ విగ్రహ నిర్మాణానికి రూ.3,643 కోట్లు
- December 24, 2018ముంబయి: అరేబియా సముద్రం ఒడ్డున నిర్మితమవుతున్న ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణాన్ని 2022-23 సంవత్సరంలోపు పూర్తిచేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రూ.3,643.78 కోట్ల బడ్జెట్ను ఇందుకు కేటాయించినట్లు పేర్కొంది. విగ్రహ నిర్మాణం ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఒక జాబితాను విడుదల చేసింది. మొత్తం బడ్జెట్లో విగ్రహ నిర్మాణానికి రూ.2,581 కోట్లు కేటాయించారు. జీఎస్టీ, భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాపనకు రూ.309.72 కోట్లు, నీటి వనరులు, విద్యుత్ సరఫరా కోసం మరో రూ.45 కోట్లు వెచ్చించనున్నారు. భవిష్యత్ అవసరాల కోసం రూ.112 కోట్లు, విగ్రహ పరిసరాల్లో కంప్యూటరీకరణ కోసం రూ.56కోట్లు, ఇతరత్రాల కోసం రూ. 140 కోట్లు కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి విగ్రహ నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు గానూ రూ.8కోట్లు ఖర్చు చేశారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!