శివాజీ విగ్రహ నిర్మాణానికి రూ.3,643 కోట్లు
- December 24, 2018
ముంబయి: అరేబియా సముద్రం ఒడ్డున నిర్మితమవుతున్న ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణాన్ని 2022-23 సంవత్సరంలోపు పూర్తిచేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రూ.3,643.78 కోట్ల బడ్జెట్ను ఇందుకు కేటాయించినట్లు పేర్కొంది. విగ్రహ నిర్మాణం ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఒక జాబితాను విడుదల చేసింది. మొత్తం బడ్జెట్లో విగ్రహ నిర్మాణానికి రూ.2,581 కోట్లు కేటాయించారు. జీఎస్టీ, భద్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాల స్థాపనకు రూ.309.72 కోట్లు, నీటి వనరులు, విద్యుత్ సరఫరా కోసం మరో రూ.45 కోట్లు వెచ్చించనున్నారు. భవిష్యత్ అవసరాల కోసం రూ.112 కోట్లు, విగ్రహ పరిసరాల్లో కంప్యూటరీకరణ కోసం రూ.56కోట్లు, ఇతరత్రాల కోసం రూ. 140 కోట్లు కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి విగ్రహ నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు గానూ రూ.8కోట్లు ఖర్చు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







