సెన్సార్ పూర్తి చేసుకున్న 'పేట్టా' చిత్రం
- December 24, 2018'పేట్టా' చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాను చూసిన తరువాత అధికారులు, కొన్ని పోరాట దృశ్యాలను మార్చితే, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, అందుకు చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ అంగీకరించలేదని, దీంతో ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తో తొలిసారిగా సిమ్రాన్, త్రిష నటించారు. కాగా విజయ్ సేతుపతి, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్ ఉందని, దాని కారణంగానే 'యూ/ఏ' ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం