సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ రీ షెడ్యూల్డ్‌

- December 25, 2018 , by Maagulf
సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ రీ షెడ్యూల్డ్‌

మస్కట్‌:డిసెంబర్‌ 28న జరగాల్సిన సెaలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌, జనవరి 25కి రీ షెడ్యూల్‌ అయ్యింది. ఆర్గనైజింగ్‌ కమిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 10 నుంచి ప్రారంభమయ్యే మస్కట్‌ ఫెస్టివల్‌లో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ భాగమైంది. సీసీఎల్‌ ఈవెంట్‌ని మస్కట్‌ ఫెస్టివల్‌ ఈవెంట్‌గా ఎంచుకున్నందుకుగాను మస్కట్‌ మునిసిపాలిటీకీ, మస్కట్‌ ఫెస్టివల్‌ కమిటీకి థ్యాంక్స్‌ చెప్పారు సిసిఎల్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ తరఫున మెహబూబ్‌ హస్సన్‌. బాలీవుడ్‌ సెలబ్రిటీ టీమ్‌ అలాగే ఒమన్‌ సెలబ్రిటీ టీమ్‌ మధ్య టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. సుల్తాన్‌ కబూస్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. సొహైల్‌ ఖాన్‌, సోనూ సూద్‌, శ్రేయాష్‌ తల్పాడే, సకిబ్‌ సలీమ్‌ తదితరులు ఇండియన్‌ టీమ్‌లో వుంటారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com