సౌదీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 25 మంది మృతి
- December 24, 2015
జాజన్ జనరల్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం 25 మందిని బలిగొంది. 107 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. సౌదీ సివిల్ డిఫెన్స్ మెంబర్స్ ప్రమాదం జరిగిన ఆసుపత్రిని సందర్శించారు. మెటర్నిటీ డిపార్ట్మెంట్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తొలుత అగ్ని ప్రమాదం చోటుచేసుకుందనీ, తక్కువ సమయంలోనే ఆ మంటలు ఆసుపత్రిలో వివిధ విభాగాలకు విస్తరించాయని అధికారులు వెల్లడించారు. హుటాహుటిన ఆసుపత్రిలోని రోగుల్ని, సిబ్బందిని, రోగుల సహాయకుల్ని తరలించడం ద్వారా ప్రాణ నష్టాన్ని వీలైనంతవరకు తగ్గించగలిగారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారమ్. ప్రమాదం ఎలా సంభవించింది? ప్రమాధానికి కారణాలు ఏంటి? వంటి ప్రశ్నలకు విచారణలో సమాధానం దొరుకుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







