న్యూ ఇయర్ వేడుకలపై ట్రాఫిక్ ఫోకస్
- December 24, 2015
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రోడ్లపై అతి వేగంగా దూసుకుపోయేవారికి అడ్డుకట్ట వేయాలని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. అబుదాబీ పోలీస్ అన్ని రోడ్లపైనా నిఘా పెట్టినట్లు వెల్లడించింది. డైరెక్టరేట్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ ట్రాఫిక్ మరియు పెట్రోల్స్ డైరెక్టరేట్ దీనికి సంబంధించి అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రహదార్లపై మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల థ్రిల్ వచ్చినా, దాంతోపాటే ప్రమాదాలు ఎదురవుతాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ర్యాష్ డ్రైవింగ్కి పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు అధికారులు. అన్ని రోడ్లపైనా నిఘా ఉంచామనీ, వాహనదారులు జాగ్రత్తగా, సంతోషంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలన్నారు. కుటుంబ సభ్యులు తమ వారికి ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కోరారు ట్రాఫిక్ అండ్ పెట్రోల్ అధికారులు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







