కర్నూలు ఎయిర్ పోర్టును ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు!
- January 08, 2019
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత జిల్లాలో విమానాశ్రయానికి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సౌరవిద్యుత్ కోసం అల్ట్రా మెగా సోలార్ పార్క్ ను ప్రారంభిస్తారు. అనంతరం స్టేట్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్, ఫార్మా క్లస్టర్ కు సీఎం భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా కోసిగి ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగే జన్మభూమి కార్యక్రమానికి సీఎం హాజరవుతారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఢిల్లీకి బయలుదేరివెళతారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







