సామూహిక నిరాహార దీక్షకు పాలస్తీనా ఖైదీలు సిద్ధం
- January 08, 2019జెరూసలేం : జైళ్ళలో పరిస్థితులను మరింత అధ్వాన్నం చేసేలా కొత్త చర్యలు చేపట్టాలని ఇజ్రాయిల్ ప్రభుత్వం భావిస్తోంది. అదే గనుక జరిగితే మూకుమ్మడిగా నిరాహార దీక్ష చేపట్టేందుకు ఇజ్రాయిల్ జైళ్ళు, నిర్బంధ కేంద్రాలు, ఇంటరాగేషన్ కేంద్రాల్లోని వందలాదిమంది పాలస్తీనియన్లు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఖైదీలు, పాలనాపరమైన నిర్బంధితులు (ఎలాంటి అభియోగాలు లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్నవారు) ఒక సంయుక్త ప్రకటన చేశారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం కొత్త తరహా అణచివేత చర్య అని వారు వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తీసుకోవడమంటే యుద్ధం ప్రకటించడమేనని, దీంతో తమ పోరాటంలో కొత్త దశ ఆరంభమైందని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. తమకు సంఘీభావంగా నిలబడాల్సిందిగా వారు పాలస్తీనా వర్గాలను, కార్యకర్తలను కోరారు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని కోరారు. ఇజ్రాయిల్లో 5500 పాలస్తీనా ఖైదీలు వున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు
- UNHCR కోసం ఖతార్ ఎయిర్వేస్ ఉదారత..!
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు