భారత కార్మికుల్ని దుబాయ్లో కలిసిన రాహుల్ గాంధీ.!
- January 11, 2019దుబాయ్:భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల యుఎఈ పర్యటనలో భాగంగా దుబాయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రాహుల్గాంధీని కలిసేందుకు పెద్ద ఎత్తున భారతదేశానికి చెందిన బ్లూ కాలర్డ్ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. వారినుద్దేశించి రాహుల్గాంధీ మాట్లాడారు. మీరు ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు. స్వదేశంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల కోసం మీరు పడుతున్న కష్టం నేను అర్ధం చేసుకోగలను. మీకు నేను అందించగలిగే సహాయం, అది ఎలాంటిదైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు రాహుల్ గాంధీ. రెండు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ దుబాయ్లో భారతదేశానికి చెందిన పలు గ్రూప్స్తో సమావేశమవుతారు. ఇదిలా ఉంటే రాహుల్ పర్యటన పట్ల దుబాయ్లో భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్పందన తాము ఊహించలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి