భారత కార్మికుల్ని దుబాయ్లో కలిసిన రాహుల్ గాంధీ.!
- January 11, 2019దుబాయ్:భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల యుఎఈ పర్యటనలో భాగంగా దుబాయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రాహుల్గాంధీని కలిసేందుకు పెద్ద ఎత్తున భారతదేశానికి చెందిన బ్లూ కాలర్డ్ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. వారినుద్దేశించి రాహుల్గాంధీ మాట్లాడారు. మీరు ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు. స్వదేశంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల కోసం మీరు పడుతున్న కష్టం నేను అర్ధం చేసుకోగలను. మీకు నేను అందించగలిగే సహాయం, అది ఎలాంటిదైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు రాహుల్ గాంధీ. రెండు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ దుబాయ్లో భారతదేశానికి చెందిన పలు గ్రూప్స్తో సమావేశమవుతారు. ఇదిలా ఉంటే రాహుల్ పర్యటన పట్ల దుబాయ్లో భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్పందన తాము ఊహించలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..