సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్‌ స్వామి శివైక్యం..సంతాపం తెలిపిన కర్నాటక ప్రభుత్వం

- January 21, 2019 , by Maagulf
సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్‌ స్వామి శివైక్యం..సంతాపం తెలిపిన కర్నాటక ప్రభుత్వం

కర్నాటక: సిద్ధగంగ మఠాధిపతి శివకుమార్‌ స్వామి మృతి పట్ల సిఎం కుమారస్వామి సంతాపం తెలిపారు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న శివకుమార్‌ (సోమవారం) కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. శివకుమార్‌ స్వామి మృతికి సంతాపంగా కర్నాటక ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రేపు (మంగళవారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. రేపు సాయంత్రం శివకుమార్‌ స్వామి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com