సచివాలయం విజయవాడకు తరలిస్తామని...

- December 26, 2015 , by Maagulf
సచివాలయం  విజయవాడకు తరలిస్తామని...

జూన్ లోపు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం మొత్తాన్ని విజయవాడకు తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సచివాలయానికి కావలసిన 6లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో 12 లక్షల 42 వేల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలలలోపు అందరికీ రేషన్ కార్డులు అందచేస్తామని, రేషన్ షాపు డీలర్లు ఎక్కడైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రానున్న 90 రోజులలో రోజుకు 5 కిలోమీటర్లు చొప్పున రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తే కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com