సచివాలయం విజయవాడకు తరలిస్తామని...
- December 26, 2015
జూన్ లోపు ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం మొత్తాన్ని విజయవాడకు తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సచివాలయానికి కావలసిన 6లక్షల చదరపు అడుగుల భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. త్వరలో 12 లక్షల 42 వేల రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. రెండు నెలలలోపు అందరికీ రేషన్ కార్డులు అందచేస్తామని, రేషన్ షాపు డీలర్లు ఎక్కడైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రానున్న 90 రోజులలో రోజుకు 5 కిలోమీటర్లు చొప్పున రహదారుల నిర్మాణాలు పూర్తి చేస్తే కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







