అయుత చండీ మహా యాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య విచ్చేశారు

- December 26, 2015 , by Maagulf
అయుత చండీ మహా యాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య విచ్చేశారు

వేద ఘోషతో జిల్లాలోని ఎర్రవెల్లిలో ఉన్న సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వర్ధిల్లుతోంది. రిత్విజుల పర్యవేక్షణలో అయుత చండీ మహా యాగం ఘనంగా కొనసాగుతోంది. ఇవాళ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎర్రవెల్లిలో జరుగుతోన్న అయుత చండీ మహా యాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్ రోశయ్యకు శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తీసుకొచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి ప్రతిమను అందజేశారు. ఇరువురు ఒకరికొకరు నమస్కరించుకున్నారు. అమ్మవారికి మరోసారి దండం పెట్టి రోశయ్య వెనుదిరిగారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com