బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న పియూష్ గోయల్
- January 24, 2019
వచ్చే ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పియూష్గోయల్ ప్రవేశపెడతారు. కొద్దిసేపటి క్రితం పియూష్ గోయల్కు ఆర్థిక శాఖతో పాటు కార్పొరేట్ శాఖలను తాత్కాలికంగా అప్పగించారు. ప్రధాని మోడీ సూచన మేరకు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి విధుల్లో చేరే వరకు ఎలాంటి శాఖలు లేని మంత్రిగా అరుణ్ జైట్లీ కేబినెట్లో కొనసాగుతారు. కేన్సర్తో బాధపడుతున్న అరుణ్ జైట్లీ ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఫిబ్రవరి 1న పియూష్ గోయాల్ ఇంటరిమ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. గత ఏడాది కూడా పూర్తి బడ్జెట్ను పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు. అపుడు కూడా అరుణ్ జైట్లీ కిడ్నీ చికిత్స కోసం సెలవులో ఉన్నారు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







