బియ్యం, పెసరపప్పు కలిపి జావగా కాచితే....
- January 27, 2019
పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక పెసలు తీసుకోవాలనిపిస్తుంది. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం.. రండి..
1. పెసల ఆహారం శరీరానికి మంచి బలాన్ని కండపుష్టిని కలిగిస్తుంది. దీని వలన రక్తక్షీణత, వాత వ్యాధులు, పేగులకు సంబంధించిన ఎన్నో వ్యాధులు నివారిస్తాయి.
2. పెసరపప్పుతో, చారుకాస్తేదాన్ని, పెసరకట్టు అంటారు. చింతపండు కలపకుండా పెసరకట్టు చేసుకుని అన్నంలో కలిపి తింటుంటే జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలిని కూడా పెంచుతుంది. జ్వరం వచ్చిన వాళ్ళకి పెసర కట్టు చాలా మంచి ఆహారం.
3. వట్టి పెసర కట్టులో నిమ్మరసం గానీ, దానిమ్మరసం గానీ, టమోటారసం గానీ, ఉసిరికాయరసం గానీ కలిపి త్రాగుతుంటే వాతవ్యాధులన్నీ నివారిస్తాయి.
4. పెసరపప్పు ఒక గ్లాస్, బియ్యం నాలుగు గ్లాసులతో అన్నం తయారుచేస్తే దీన్ని పెసర పులగం అంటారు. ఇలా చేసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. మొలలు ఉండేవారు రోజూ దీన్ని తినడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.
5. ఇది శరీరానికి బలాన్ని కలిగిస్తుంది. వాత వ్యాధులను నివారిస్తుంది. కడుపులో పుండు, పేగుపూత, కాళ్ళు, కళ్ళు మంటలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఇది ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది. కాబట్టి ఇందులో అల్లం, మిరియాలు, నెయ్యి వంటివి కలిపి తింటే సులువుగా జీర్ణమవుతుంది.
6. బియ్యం నాలుగు గ్లాసులు, పెసరపప్పు ఒక గ్లాసు కలిపి జావగా కాచి తాగవచ్చు. జ్వరంతోనున్న వారికి ఇది మంచి ఆహారం.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









