భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC
- January 28, 2019
హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న ఆకాలవర్షాలతో నగరవాసులకు ఏ విధమైన ఇబ్బందులూ కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. భారీవర్షం నేపథ్యంలో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్తో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. నగరంలోని వాతావరణ పరిస్థితులు, పౌర సమస్యలపై కమిషనర్తో సమీక్షించారు. జీహెచ్ఎంసీ విపత్తుల నివారణ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో కలిసి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజ్భవన్రోడ్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో పర్యటించి రోడ్లపై వరదనీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు వర్షాలు పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండటంతోపాటు వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలూ మూడు షిఫ్టులుగా పనిచేస్తునట్లు తెలిపారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు.GHMC మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హైదరాబాద్ వాసులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమల: తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్
- ఫ్రాడ్ జరిగితే డబ్బులు వెనక్కి! RBI కొత్త పాలసీ ఇదే!
- విద్యార్థులకు ప్రధాని మోదీ సందేశం
- 17,18 తేదీల్లో హైదరాబాద్లో బయో-ఆసియా సదస్సు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!









