భారీ వర్షాలతో అప్రమత్తమైన GHMC
- January 28, 2019
హైదరాబాద్: నగరంలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న ఆకాలవర్షాలతో నగరవాసులకు ఏ విధమైన ఇబ్బందులూ కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టారు. భారీవర్షం నేపథ్యంలో సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్తో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. నగరంలోని వాతావరణ పరిస్థితులు, పౌర సమస్యలపై కమిషనర్తో సమీక్షించారు. జీహెచ్ఎంసీ విపత్తుల నివారణ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటితో కలిసి ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజ్భవన్రోడ్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో పర్యటించి రోడ్లపై వరదనీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు వర్షాలు పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండటంతోపాటు వరద ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 24 గంటలూ మూడు షిఫ్టులుగా పనిచేస్తునట్లు తెలిపారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలన్నారు.GHMC మేయర్ బొంతు రామ్మోహన్ కూడా హైదరాబాద్ వాసులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..