గల్ఫ్ మృతదేహాలను తరలించడానికి అయ్యే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం:ఎయిర్ ఇండియా
- January 29, 2019
ఢిల్లీ: పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను భరించలేక బాధిత కుటుంబాలు అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి. అలాంటి వారి శోకాన్ని అర్థం చేసుకున్న ఎయిర్ ఇండియా మృతదేహాలను తరలించడానికి అయ్యే ఛార్జీలను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది.
'భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖతో చర్చించాం. భారతీయులు ఎక్కువగా ఉన్న ఆరు గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి తక్కువ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణియించాం. సాధారణం కంటే 40శాతం రాయితీ కల్పించనున్నాం' అని ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి సోమవారం తెలిపారు. ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం యూ.ఏ.ఈ కు రూ.29,000, సౌదీ అరెబియాకు రూ.41,800, కతార్కు రూ.43,000, బహ్రెయిన్ కు రూ.42,500, ఒమన్కు రూ.29,500, కువైట్కు రూ.40,900 ఛార్జీలు వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ రాయితీలను మరికొన్ని దేశాలకు కూడా వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం భారత్ నుంచి దాదాపు 1.7కోట్ల మంది విదేశాలకు వలసవెళ్లారు. వీరిలో 50లక్షల వరకు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- పీబీ సిద్ధార్ధ అకాడమీ స్వర్ణోత్సవాల్లో సీఎం చంద్రబాబు
- సినీ పరిశ్రమను పట్టించుకోవడం మానేశా: మంత్రి కోమటిరెడ్డి
- కృష్ణా నది తీరంలో తెలుగుదనం సందడి
- 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్లో 522 మంది కంటెంట్ క్రియేటర్లకు శిక్షణ పూర్తి
- హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి హృదయ వైద్య శిక్షణ
- అనురాగ సౌరభం..రామకృష్ణ మిషన్ స్కూల్ వజ్రోత్సవం







