గల్ఫ్ మృతదేహాలను తరలించడానికి అయ్యే ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం:ఎయిర్ ఇండియా
- January 29, 2019ఢిల్లీ: పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళుతున్న అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి మృతదేహాలను ఇంటికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను భరించలేక బాధిత కుటుంబాలు అనేక సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాయి. అలాంటి వారి శోకాన్ని అర్థం చేసుకున్న ఎయిర్ ఇండియా మృతదేహాలను తరలించడానికి అయ్యే ఛార్జీలను తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది.
'భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖతో చర్చించాం. భారతీయులు ఎక్కువగా ఉన్న ఆరు గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి మృతదేహాలను తరలించడానికి తక్కువ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణియించాం. సాధారణం కంటే 40శాతం రాయితీ కల్పించనున్నాం' అని ఎయిరిండియాకు చెందిన ఓ అధికారి సోమవారం తెలిపారు. ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం యూ.ఏ.ఈ కు రూ.29,000, సౌదీ అరెబియాకు రూ.41,800, కతార్కు రూ.43,000, బహ్రెయిన్ కు రూ.42,500, ఒమన్కు రూ.29,500, కువైట్కు రూ.40,900 ఛార్జీలు వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో ఈ రాయితీలను మరికొన్ని దేశాలకు కూడా వర్తింపజేసే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం భారత్ నుంచి దాదాపు 1.7కోట్ల మంది విదేశాలకు వలసవెళ్లారు. వీరిలో 50లక్షల వరకు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం