ఇరాక్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న గల్ఫ్‌ బాధితులు

- January 30, 2019 , by Maagulf
ఇరాక్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న గల్ఫ్‌ బాధితులు

హైదరాబాద్:గల్ఫ్‌ బాధితులు ఇరాక్‌ నుంచి హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్నారు. ఇరాక్‌ నుంచి 14 మంది గల్ఫ్‌ బాధితులు విమానంలో ఢిల్లికి వచ్చారు. అక్కడి నుంచి రైలులో బాధితులు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత,పాట్కూరి బసంత్ రెడ్డి చొరవతో గల్ఫ్‌ బాధితులు క్షేమంగా తిరిగి వచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడి ఇరాక్‌లో చిక్కుకున్న నిజామాబాద్‌ వాసుల(గల్ఫ్‌ బాధితులు)ను స్వదేశానికి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. 14 మంది గల్ఫ్‌ బాధితులు ఐదు నెలల పాటు ఇరాక్‌లో ఒక గదిలో బందీగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com