ఇరాక్ నుంచి హైదరాబాద్ చేరుకున్న గల్ఫ్ బాధితులు
- January 30, 2019
హైదరాబాద్:గల్ఫ్ బాధితులు ఇరాక్ నుంచి హైదరాబాద్కు క్షేమంగా చేరుకున్నారు. ఇరాక్ నుంచి 14 మంది గల్ఫ్ బాధితులు విమానంలో ఢిల్లికి వచ్చారు. అక్కడి నుంచి రైలులో బాధితులు కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత,పాట్కూరి బసంత్ రెడ్డి చొరవతో గల్ఫ్ బాధితులు క్షేమంగా తిరిగి వచ్చారు. విదేశాంగ శాఖతో మాట్లాడి ఇరాక్లో చిక్కుకున్న నిజామాబాద్ వాసుల(గల్ఫ్ బాధితులు)ను స్వదేశానికి తీసుకురావడంలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారు. 14 మంది గల్ఫ్ బాధితులు ఐదు నెలల పాటు ఇరాక్లో ఒక గదిలో బందీగా ఉన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







