తెలంగాణ:సీఎం విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం
- January 30, 2019
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు చేయూతనందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ పథకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ జిల్లా మైనార్టీల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. స్కాలర్ షిప్ కొరకు ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కు, జైన్, పార్సీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఉపకార వేతనంతో పాటు విమాన టికెట్ చార్జీలను సైతం మంజూరు చేస్తారని తెలిపారు. - డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.- జీఆర్ఈ, టోఫెల్, ఐలెట్స్ వంటి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. - విశ్వ విద్యాలయంలో ఆగస్టు-2018 నుంచి 2018 డిసెంబర్ వరకు ప్రవేశం పొందినవారు సంబంధిత వెబ్సైట్లో 2019 జనవరి 27వ తేదీ నుంచి 2019 ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ కార్యాలయంలో నేరుగా గానీ, 96769 89460 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







