జయరాం మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..
- February 02, 2019
పారిశ్రామిక వేత్త జయరాం మర్డర్ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాడి చేసిన తరువాత శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ అజ్ఞాతంలోకి వెళ్లాడని.. జయరాం మర్డర్ తరువాత నుంచి శిఖా బాయ్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
జయరాం తలమీద బలంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జయరాంపై దాడి చేసిన తరువాత హడావుడిలో అక్కడి నుంచి నిందితులు ఎస్కేప్ అయ్యారు.తనపై దాడి జరగవచ్చని ముందుగానే గుర్తించిన జయరాం…ఆర్థిక లావాదేవిలు తన మెడకు చుట్టుకోవచ్చని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.
జయరాంతో పాటు ఆ రోజంతా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్లో శిఖా చౌదరితో పాటు మరో మహిళను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవిలే అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అమెరికా నుంచి రేపు ఉదయం హైదరాబాద్కు జయరాం కుటుంబ సభ్యులు రానున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







