జయరాం మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది..
- February 02, 2019పారిశ్రామిక వేత్త జయరాం మర్డర్ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. జయరాం మర్డర్ కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాడి చేసిన తరువాత శిఖా చౌదరి బాయ్ ఫ్రెండ్ అజ్ఞాతంలోకి వెళ్లాడని.. జయరాం మర్డర్ తరువాత నుంచి శిఖా బాయ్ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
జయరాం తలమీద బలంగా దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జయరాంపై దాడి చేసిన తరువాత హడావుడిలో అక్కడి నుంచి నిందితులు ఎస్కేప్ అయ్యారు.తనపై దాడి జరగవచ్చని ముందుగానే గుర్తించిన జయరాం…ఆర్థిక లావాదేవిలు తన మెడకు చుట్టుకోవచ్చని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం.
జయరాంతో పాటు ఆ రోజంతా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సెల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ఓ గెస్ట్ హౌజ్లో శిఖా చౌదరితో పాటు మరో మహిళను పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవిలే అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. అమెరికా నుంచి రేపు ఉదయం హైదరాబాద్కు జయరాం కుటుంబ సభ్యులు రానున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం