"బూర్జ్ ఖలీఫా" తో శ్రీమంతుడు తనయుడు
- December 27, 2015
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న "బ్రహ్మోత్సవం" సినిమా ఊటీ షెడ్యూల్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. దీంతో కొంత సమయం లభించడంతో మళ్ళీ తన భార్య, పిల్లలతో కలిసి టూర్ కు చెక్కేసారు. ఇటీవల తన సోదరుడి (బాబాయ్ కొడుకు) వివాహ మహోత్సవాన్ని చూసుకున్న తర్వాత ప్రిన్స్ టూర్ కు వెళ్ళిపోయారు. అయితే ఎక్కడికి వెళ్ళారోనన్న అభిమానుల సందేహాన్ని ప్రిన్స్ చేసిన తాజా ట్వీట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రిన్స్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో పండగ చేసుకుంటున్నారు. దుబాయ్ లో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా పేరు గాంచిన "బూర్జ్ ఖలీఫా" మబ్బులలో కలిసిపోయిందని, దుబాయ్ లో ఉన్న వాతావరణం ఇందుకు నిదర్శమని, కొడుకు గౌతమ్ హ్యండ్సప్ అన్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు. దీంతో దుబాయ్ లో ఉన్న ప్రిన్స్ అభిమానులు 'మేము ఇక్కడే ఉన్నాం. మీ చిరునామా చెప్పగలరు.' అంటూ ప్రిన్స్ ను ప్రశ్నిస్తున్నారు. అన్నట్లు. కొత్త సంవత్సరం వేడుకలను కూడా ప్రిన్స్ దుబాయ్ లోనే జరుపుకోబోతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







