"బూర్జ్ ఖలీఫా" తో శ్రీమంతుడు తనయుడు
- December 27, 2015
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న "బ్రహ్మోత్సవం" సినిమా ఊటీ షెడ్యూల్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. దీంతో కొంత సమయం లభించడంతో మళ్ళీ తన భార్య, పిల్లలతో కలిసి టూర్ కు చెక్కేసారు. ఇటీవల తన సోదరుడి (బాబాయ్ కొడుకు) వివాహ మహోత్సవాన్ని చూసుకున్న తర్వాత ప్రిన్స్ టూర్ కు వెళ్ళిపోయారు. అయితే ఎక్కడికి వెళ్ళారోనన్న అభిమానుల సందేహాన్ని ప్రిన్స్ చేసిన తాజా ట్వీట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రిన్స్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో పండగ చేసుకుంటున్నారు. దుబాయ్ లో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా పేరు గాంచిన "బూర్జ్ ఖలీఫా" మబ్బులలో కలిసిపోయిందని, దుబాయ్ లో ఉన్న వాతావరణం ఇందుకు నిదర్శమని, కొడుకు గౌతమ్ హ్యండ్సప్ అన్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు. దీంతో దుబాయ్ లో ఉన్న ప్రిన్స్ అభిమానులు 'మేము ఇక్కడే ఉన్నాం. మీ చిరునామా చెప్పగలరు.' అంటూ ప్రిన్స్ ను ప్రశ్నిస్తున్నారు. అన్నట్లు. కొత్త సంవత్సరం వేడుకలను కూడా ప్రిన్స్ దుబాయ్ లోనే జరుపుకోబోతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









