"బూర్జ్ ఖలీఫా" తో శ్రీమంతుడు తనయుడు
- December 27, 2015
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న "బ్రహ్మోత్సవం" సినిమా ఊటీ షెడ్యూల్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. దీంతో కొంత సమయం లభించడంతో మళ్ళీ తన భార్య, పిల్లలతో కలిసి టూర్ కు చెక్కేసారు. ఇటీవల తన సోదరుడి (బాబాయ్ కొడుకు) వివాహ మహోత్సవాన్ని చూసుకున్న తర్వాత ప్రిన్స్ టూర్ కు వెళ్ళిపోయారు. అయితే ఎక్కడికి వెళ్ళారోనన్న అభిమానుల సందేహాన్ని ప్రిన్స్ చేసిన తాజా ట్వీట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రిన్స్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో పండగ చేసుకుంటున్నారు. దుబాయ్ లో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా పేరు గాంచిన "బూర్జ్ ఖలీఫా" మబ్బులలో కలిసిపోయిందని, దుబాయ్ లో ఉన్న వాతావరణం ఇందుకు నిదర్శమని, కొడుకు గౌతమ్ హ్యండ్సప్ అన్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు. దీంతో దుబాయ్ లో ఉన్న ప్రిన్స్ అభిమానులు 'మేము ఇక్కడే ఉన్నాం. మీ చిరునామా చెప్పగలరు.' అంటూ ప్రిన్స్ ను ప్రశ్నిస్తున్నారు. అన్నట్లు. కొత్త సంవత్సరం వేడుకలను కూడా ప్రిన్స్ దుబాయ్ లోనే జరుపుకోబోతున్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







