నిఘా నేత్ర వ్యవస్థతో దుబాయ్ పోలీసులు వెతుకుతున్న1600 కు పైగా కార్లు పట్టివేత
- December 27, 2015
11 నెలల వ్యవధిలో నిఘా నేత్ర వ్యవస్థతో కొంత కాలంగా పోలీసులు వెతుకుతున్న1600 కు పైగా కార్లను పట్టుకోగలిగారు. ట్రాఫిక్ , చట్ట విరుద్దమైన చర్యలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వీరిని అదుపులో తీసుకొన్నట్లు దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. తమ పెట్రోలింగ్ వాహనాల సైరన్ లైట్ల పక్కనే అమర్చిన ఈ కెమెరా వ్యవస్థ అద్భుతంగా పని చేయడంతో వీటిని తాము నిరంతరం ఇక వినియోగించనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మశ్రొఉఇ తెలిపారు. ఈ నిఘా వ్యవస్థ ద్వారా ఏ వాహనానైన చలన మ ఆచలన్ స్థితిలో వాటి లైసెన్స్ ప్లేట్ ను స్పష్టంగా చూడగలమని వివరించారు. తాము పట్టుకొన్న కార్లలో 573 మంది ట్రాఫిక్నియమాలను ఉల్లంఘించి పరారైన వారు కాగా, మిగిలిన 1091 వాహనదారులు వివిధ నేరాలకు సంబంధించిన కేసులను కల్గి ఉన్నవారు కావడం గమనార్హమన్నారు. నిఘా నేత్ర వ్యవస్థతో గత 11 నెలల కాలంలో వెతుకుతున్న 1664 కార్లను సులువుగా పట్టుకొన్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







