భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి: నేపాల్
- February 06, 2019
ఖాట్మండు: భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి చేస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేందుకు వెళ్లే కార్మికులకు ఈ అనుమతులను తప్పనిసరి చేసింది. నేపాల్ ప్రభుత్వ కార్మిక, వృత్తి భద్రత విభాగం దేశ వ్యాప్తంగా ఉన్న లేబర్ కార్యాలయాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల వాస్తవ సంఖ్యను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఈ గణనలో వర్క్ పర్మిట్ లేకుండా భారతీయులు సంస్థల్లో పనిచేస్తుంటే సంబంధిత సంస్థకు తెలియజేసి వారిని అనుమతులు తీసుకోవాల్సిందిగా చెప్పాలన్నారు. ఇరు దేశాల సంబంధాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఇటువంటి నియమాలు ఏవీ అమల్లో లేవు. దేశ సరిహద్దు రక్షణలో భాగంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. గత నెలలో నేపాల్ రాష్ట్ర బ్యాంకు భారతీయ కరెన్సీ రూ. 200, రూ. 500, రూ.2000 నోట్లను రద్దు చేసింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







