భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి: నేపాల్
- February 06, 2019
ఖాట్మండు: భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి చేస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేందుకు వెళ్లే కార్మికులకు ఈ అనుమతులను తప్పనిసరి చేసింది. నేపాల్ ప్రభుత్వ కార్మిక, వృత్తి భద్రత విభాగం దేశ వ్యాప్తంగా ఉన్న లేబర్ కార్యాలయాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల వాస్తవ సంఖ్యను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఈ గణనలో వర్క్ పర్మిట్ లేకుండా భారతీయులు సంస్థల్లో పనిచేస్తుంటే సంబంధిత సంస్థకు తెలియజేసి వారిని అనుమతులు తీసుకోవాల్సిందిగా చెప్పాలన్నారు. ఇరు దేశాల సంబంధాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఇటువంటి నియమాలు ఏవీ అమల్లో లేవు. దేశ సరిహద్దు రక్షణలో భాగంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. గత నెలలో నేపాల్ రాష్ట్ర బ్యాంకు భారతీయ కరెన్సీ రూ. 200, రూ. 500, రూ.2000 నోట్లను రద్దు చేసింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







