అభిమానులకు షాకిచ్చిన తలైవా!
- February 17, 2019సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానులకు షాకిచ్చారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు రజనీ. అంతే కాదు తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్నోట్ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు తెలిపారు రజనీకాంత్. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు.
రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. రజనీ మక్కల్ మండ్రమ్ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోలేదు. లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కానీ తాజా ప్రకటనతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.
రజనీ కాంత్ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పార్టీ పేరేంటి? దాని విధి విధానాలేంటి అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం