పాకిస్తాన్ కు లక్షన్నర కోట్లు ఇచ్చిన సౌదీ యువరాజు

- February 18, 2019 , by Maagulf
పాకిస్తాన్ కు లక్షన్నర కోట్లు ఇచ్చిన సౌదీ యువరాజు

ఇస్లామాబాద్: ఆర్థిక కష్టాల్లో మునిగి కిందా మీదా పడుతున్న పాకిస్థాన్‌ను సౌదీ యువరాజు  మహ్మద్ బిన్ సల్మాన్ ఆదుకున్నారు. ఏకంగా 2000 కోట్ల డాలర్లు (సుమారు రూ.లక్షన్నర కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి ఆయన పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలే కష్టాల్లో ఉన్న మన దాయాది దేశానికి ఇది గొప్ప ఆఫరే. దీంతో అనుకున్నదే తడువుగా ఆయనకు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషానె పాకిస్థాన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి.. సల్మాన్‌కు ఈ అవార్డు అందజేయనున్నారు. పాక్‌లో ఆ అవార్డు అందుకున్న తర్వాత సల్మాన్ ఇండియా పర్యటనకు రానుండటం విశేషం. తీవ్రమైన ఆర్థిక లోటుతో పాక్ సతమతమవుతున్నది. కొన్ని రోజులుగా భారీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నది. ఈ సమయంలో సౌదీ భారీ మొత్తం పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. పుల్వామా దాడి పాకిస్థాన్ పనే అని ఇండియా ఆరోపిస్తున్న సమయంలో సౌదీ యువరాజు పాక్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com