పాకిస్తాన్ కు లక్షన్నర కోట్లు ఇచ్చిన సౌదీ యువరాజు
- February 18, 2019
ఇస్లామాబాద్: ఆర్థిక కష్టాల్లో మునిగి కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదుకున్నారు. ఏకంగా 2000 కోట్ల డాలర్లు (సుమారు రూ.లక్షన్నర కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి ఆయన పాకిస్థాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలే కష్టాల్లో ఉన్న మన దాయాది దేశానికి ఇది గొప్ప ఆఫరే. దీంతో అనుకున్నదే తడువుగా ఆయనకు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషానె పాకిస్థాన్ను ఇవ్వాలని నిర్ణయించింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి.. సల్మాన్కు ఈ అవార్డు అందజేయనున్నారు. పాక్లో ఆ అవార్డు అందుకున్న తర్వాత సల్మాన్ ఇండియా పర్యటనకు రానుండటం విశేషం. తీవ్రమైన ఆర్థిక లోటుతో పాక్ సతమతమవుతున్నది. కొన్ని రోజులుగా భారీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నది. ఈ సమయంలో సౌదీ భారీ మొత్తం పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. పుల్వామా దాడి పాకిస్థాన్ పనే అని ఇండియా ఆరోపిస్తున్న సమయంలో సౌదీ యువరాజు పాక్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









