పాకిస్తాన్ కు లక్షన్నర కోట్లు ఇచ్చిన సౌదీ యువరాజు
- February 18, 2019
ఇస్లామాబాద్: ఆర్థిక కష్టాల్లో మునిగి కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదుకున్నారు. ఏకంగా 2000 కోట్ల డాలర్లు (సుమారు రూ.లక్షన్నర కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి ఆయన పాకిస్థాన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలే కష్టాల్లో ఉన్న మన దాయాది దేశానికి ఇది గొప్ప ఆఫరే. దీంతో అనుకున్నదే తడువుగా ఆయనకు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషానె పాకిస్థాన్ను ఇవ్వాలని నిర్ణయించింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి.. సల్మాన్కు ఈ అవార్డు అందజేయనున్నారు. పాక్లో ఆ అవార్డు అందుకున్న తర్వాత సల్మాన్ ఇండియా పర్యటనకు రానుండటం విశేషం. తీవ్రమైన ఆర్థిక లోటుతో పాక్ సతమతమవుతున్నది. కొన్ని రోజులుగా భారీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నది. ఈ సమయంలో సౌదీ భారీ మొత్తం పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. పుల్వామా దాడి పాకిస్థాన్ పనే అని ఇండియా ఆరోపిస్తున్న సమయంలో సౌదీ యువరాజు పాక్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







