పాకిస్తాన్ కు భారీ షాక్ ఇవ్వనున్న భారత్

- February 18, 2019 , by Maagulf
పాకిస్తాన్ కు భారీ షాక్ ఇవ్వనున్న భారత్

పుల్వామా ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది భారత్. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌ నుంచి.. పాకిస్తాన్‌లో ముజఫరాబాద్‌కు నడిచే బస్సు సర్వీసును రద్దు చేశారు. ఇప్పటికే దిగుమతి సుంకాలను భారీగా పెంచిన భారత్.. వాణిజ్య బంధాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి.

 

మరోవైపు.. అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసు విచారణ జరుగుతోంది. భారత తరఫున సీనియర్ అడ్వొకేట్ హరీష్‌ సాల్వే వాదనలు ప్రారంభించారు. పాకిస్తాన్‌వి అసంబద్ధ ఆరోపణలని ఏకిపారేశారు. వియన్నా ఒప్పందానికి తూట్లు పొడిచిందని.. జాదవ్ విషయంలో అమానవీయంగా ప్రవర్తించారని ICJ దృష్టికి తీసుకెళ్లారు సాల్వే. జాదవ్‌ అంశాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసుకునేందుకు పాక్ వాడుకుందని అన్నారు.ఈ నెల 21వరకు జాదవ్‌ కేసులో వాదనలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com