రోడ్డు ప్రమాదం: కోమాలో భారతీయ మహిళ
- February 20, 2019
దుబాయ్: ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళ కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆమెను బతికించేందుకుగాను సౌత్ దుబాయ్ కమ్యూనిటీ నిధుల సేకరణ చేపట్టారు. రిటైర్డ్ ఇంగ్లీషు ప్రొఫెసర్ అయిన 61 ఏళ్ళ సుచిత్ర ప్రతాప్, డిస్కవరీ గార్డెన్స్లో వున్న తన కుమారుడి కుటుంబాన్ని సందర్శించే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ కుమారుడైన నవదీప్ ప్రతాప్ మాట్లాడుతూ, తన తల్లి వస్తున్న సమయంలో అక్కడే ఫుట్బాల్ ఆడుతున్న ఓ వ్యక్తి చూసుకోకుండా అతి వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టాడనీ, దాంతో తన తల్లి కింద పడిపోయిందని చెప్పారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని, ఆమె కోమాలోకి వెళ్ళినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు నవదీప్ ప్రతాప్. రెండు వారాల తర్వాత సుచిత్రకు వెంటిలేటర్ తొలగించారు వైద్యులు. అయితే ఆమె ఇంకా కోమాలోనే వున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నవదీప్ ప్రతాప్. ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోతున్నాయనీ, ఇప్పటికే 300,000 దిర్హామ్లు ఖర్చయిందనీ, హైద్రాబాద్కి తరలించాలనుకుంటున్నామనీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రతాప్ చెప్పారు. కమ్యూనిటీ మెంబర్స్ తమకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎయిర్ అంబులెన్స్ కోసం నెగోసియేషన్స్ చేస్తున్నామనీ, ఇండియన్ కాన్సులేట్తో సంప్రదింపులూ జరుపుతున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









