రోడ్డు ప్రమాదం: కోమాలో భారతీయ మహిళ
- February 20, 2019
దుబాయ్: ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళ కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆమెను బతికించేందుకుగాను సౌత్ దుబాయ్ కమ్యూనిటీ నిధుల సేకరణ చేపట్టారు. రిటైర్డ్ ఇంగ్లీషు ప్రొఫెసర్ అయిన 61 ఏళ్ళ సుచిత్ర ప్రతాప్, డిస్కవరీ గార్డెన్స్లో వున్న తన కుమారుడి కుటుంబాన్ని సందర్శించే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ కుమారుడైన నవదీప్ ప్రతాప్ మాట్లాడుతూ, తన తల్లి వస్తున్న సమయంలో అక్కడే ఫుట్బాల్ ఆడుతున్న ఓ వ్యక్తి చూసుకోకుండా అతి వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టాడనీ, దాంతో తన తల్లి కింద పడిపోయిందని చెప్పారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని, ఆమె కోమాలోకి వెళ్ళినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు నవదీప్ ప్రతాప్. రెండు వారాల తర్వాత సుచిత్రకు వెంటిలేటర్ తొలగించారు వైద్యులు. అయితే ఆమె ఇంకా కోమాలోనే వున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నవదీప్ ప్రతాప్. ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోతున్నాయనీ, ఇప్పటికే 300,000 దిర్హామ్లు ఖర్చయిందనీ, హైద్రాబాద్కి తరలించాలనుకుంటున్నామనీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రతాప్ చెప్పారు. కమ్యూనిటీ మెంబర్స్ తమకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎయిర్ అంబులెన్స్ కోసం నెగోసియేషన్స్ చేస్తున్నామనీ, ఇండియన్ కాన్సులేట్తో సంప్రదింపులూ జరుపుతున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







