రోడ్డు ప్రమాదం: కోమాలో భారతీయ మహిళ
- February 20, 2019
దుబాయ్: ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళ కోమాలోకి వెళ్ళిపోవడంతో ఆమెను బతికించేందుకుగాను సౌత్ దుబాయ్ కమ్యూనిటీ నిధుల సేకరణ చేపట్టారు. రిటైర్డ్ ఇంగ్లీషు ప్రొఫెసర్ అయిన 61 ఏళ్ళ సుచిత్ర ప్రతాప్, డిస్కవరీ గార్డెన్స్లో వున్న తన కుమారుడి కుటుంబాన్ని సందర్శించే క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. ఫిబ్రవరి 6న ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ కుమారుడైన నవదీప్ ప్రతాప్ మాట్లాడుతూ, తన తల్లి వస్తున్న సమయంలో అక్కడే ఫుట్బాల్ ఆడుతున్న ఓ వ్యక్తి చూసుకోకుండా అతి వేగంతో దూసుకొచ్చి ఢీకొట్టాడనీ, దాంతో తన తల్లి కింద పడిపోయిందని చెప్పారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని, ఆమె కోమాలోకి వెళ్ళినట్లు వైద్యులు నిర్ధారించారని చెప్పారు నవదీప్ ప్రతాప్. రెండు వారాల తర్వాత సుచిత్రకు వెంటిలేటర్ తొలగించారు వైద్యులు. అయితే ఆమె ఇంకా కోమాలోనే వున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నవదీప్ ప్రతాప్. ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోతున్నాయనీ, ఇప్పటికే 300,000 దిర్హామ్లు ఖర్చయిందనీ, హైద్రాబాద్కి తరలించాలనుకుంటున్నామనీ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రతాప్ చెప్పారు. కమ్యూనిటీ మెంబర్స్ తమకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎయిర్ అంబులెన్స్ కోసం నెగోసియేషన్స్ చేస్తున్నామనీ, ఇండియన్ కాన్సులేట్తో సంప్రదింపులూ జరుపుతున్నామని చెప్పారాయన.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







