శుభ్రత పాటించట్లేదని 5వేల రెస్టారెంట్లను..
- February 23, 2019
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే నిమిషాల్లో నీట్గా ప్యాక్ చేసి ఉన్న పార్సిల్ మీముందుంటుంది. వాళ్లు ఎలా చేసారో.. శుభ్రత పాటిస్తారో లేదో ఇలాంటివి ఏవీ గుర్తుకు రావు. ఫుడ్ రాగానే టేస్టీగా ఉందని లొట్టలేసుకుంటూ తినేస్తుంటాము. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రెస్టారెంట్లు ప్రమాణాలు పాటించట్లేదని గుర్తించారు.
శుభ్రత విషయంలో అశ్రద్ధ కనబరుస్తున్నారని గుర్తించింది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. ఎఫ్ఎష్ఎస్ఏఐ ప్రమాణాలను పాటించని 5,000 రెస్టారెంట్లను తమ ప్లాట్ఫామ్పై నుంచి తొలగిస్తున్నట్లు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది. ఇప్పటి వరకు నమోదైన 150 నగరాల్లోని 80 వేలకు పైగా రెస్టారెంట్లను ఆడిట్ చేస్తున్నామని తెలిపింది. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు అమలు చేయకపోతే డిలీట్ చేస్తామని జొమాటో సీఈఓ మోహిత్ గుప్తా తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







