మహాశివరాత్రి: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

- March 04, 2019 , by Maagulf
మహాశివరాత్రి: కుంభమేళాకు పోటెత్తిన భక్తులు

ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు చివరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 49 రోజులపాటు జరిగిన కుంభమేళా ఈ రోజుతో పూర్తికానుంది. శివరాత్రినాడు కుంభమేళాలో 80 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారని అధికారులు అంచనావేస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం కుంభమేళాలో భద్రతను మరింతగా పెంచారు. జనవరి 15న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటివరకూ మొత్తం 22 కోట్ల మంది స్నానమాచరించారు. కుంభమేళా పర్యవేక్షణాధికారి విజయ్ కిరణ్ మాట్లాడుతూ మేళాలో చివరి రోజున పుణ్య స్నానాలకు అధికసంఖ్యలో భక్తులు రానున్నారని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com