12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న ఇండియన్
- March 04, 2019
అబుదాబీ బిగ్ టికెట్ రాఫెల్ లో 12 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్నారు భారతదేశానికి చెందిన రాగీ జార్జ్. కేరళలోని అలప్పుజాకి చెందిన రాగీ జార్జ్, కువైట్లో నివసిస్తున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రాఫెల్ ను నిర్వహించిన రిచార్డ్ ఈ విషయాన్ని చెప్పగానే, రాగీ జార్జ్ అస్సలేమాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోయారట. ఈ ఏడాది వరుసగా రెండు నెలల్లోనూ కేరళకు చెందినవారే మెగా ప్రైజ్ని గెలుస్తూ వస్తున్నారు. కాగా, తాను 12 ఏళ్ళ నుంచీ కువైట్లో నివసిస్తున్నాననీ, తన కుమార్తె 10వ గ్రేడ్ చదువుతోందనీ, మరో ఏడాది రెండేళ్ళలో ఇండియాకి వెళదామనుకున్నామనీ జార్జ్ చెప్పారు. ఓ ప్రైవేటు సంస్థలో పర్చేజ్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్గా జార్జ్ విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









