భారత్కు షాక్ ఇచ్చిన ట్రంప్
- March 05, 2019ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు తీవ్రంగా నష్టపరుస్తుంది. ఎగుమతులు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బందిగా మారనుంది. అయితే భారత్ మార్కెట్లలో కూడా తమ ఉత్పత్తులకు ప్రిఫరెన్సినల్ ట్రేడ్ స్టేటస్ ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్ ఇందుకు అంగీకరిస్తే బారత్ కు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోతుంది. దీంతో భారత్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో బారత్ పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. భారత్తో అమెరికా వర్తక లోటును తగ్గించే క్రమంలో ట్రంప్ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 2017లో భారత్తో అమెరికా వాణిజ్య లోటు 2730 కోట్ల డాలర్లుగా ఉంది. పన్నుల కారణంగానే తగ్గినట్టు ట్రంప్ భావిస్తున్నారు. తమకు కూడా ప్రాధాన్యత హోదా ఇస్తే పెరుగుతుందని ట్రంప్ నమ్ముతున్నారు. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారీగా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే చర్య ఇదే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు