భారత్కు షాక్ ఇచ్చిన ట్రంప్
- March 05, 2019
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు తీవ్రంగా నష్టపరుస్తుంది. ఎగుమతులు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బందిగా మారనుంది. అయితే భారత్ మార్కెట్లలో కూడా తమ ఉత్పత్తులకు ప్రిఫరెన్సినల్ ట్రేడ్ స్టేటస్ ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్ ఇందుకు అంగీకరిస్తే బారత్ కు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోతుంది. దీంతో భారత్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో బారత్ పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. భారత్తో అమెరికా వర్తక లోటును తగ్గించే క్రమంలో ట్రంప్ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 2017లో భారత్తో అమెరికా వాణిజ్య లోటు 2730 కోట్ల డాలర్లుగా ఉంది. పన్నుల కారణంగానే తగ్గినట్టు ట్రంప్ భావిస్తున్నారు. తమకు కూడా ప్రాధాన్యత హోదా ఇస్తే పెరుగుతుందని ట్రంప్ నమ్ముతున్నారు. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారీగా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే చర్య ఇదే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









