భారత సబ్మెరైన్ని అడ్డుకున్న పాకిస్తాన్
- March 05, 2019
తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందంటూ భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామి (సబ్మెరైన్)ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఇటీవల భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 'మా ప్రాదేశిక జలాల్లోకి భారత జలాంతర్గామి వచ్చేందుకు ప్రయత్నించింది. దాన్ని మేం అడ్డుకున్నాం. గతంలో కూడా ఓ సారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది' అని పాకిస్తాన్ నేవీకి చెందిన అధికార ప్రతినిథి వెల్లడించారు. భారత్తో ఎలాంటి వైరం పెట్టుకునే ఉద్దేశ్యం తమకు లేదనీ, శాంతియుత ఆలోచనలతోనే తాము ఆ జలాంతర్గామిని టార్గెట్ చేయలేదని తెలిపారాయన. గతంలో, అంటే 2016లో ఇలాంటి ఘటన జరిగింది. ఇదిలా వుంటే, భారత నావికా దళం, పాకిస్తాన్ ఆరోపణల్ని తిప్పికొట్టింది. అలాంటి ఘటన ఏదీ జరగలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







