భారత సబ్మెరైన్ని అడ్డుకున్న పాకిస్తాన్
- March 05, 2019
తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందంటూ భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామి (సబ్మెరైన్)ని పాకిస్తాన్ అడ్డుకుంది. ఇటీవల భారత్ - పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 'మా ప్రాదేశిక జలాల్లోకి భారత జలాంతర్గామి వచ్చేందుకు ప్రయత్నించింది. దాన్ని మేం అడ్డుకున్నాం. గతంలో కూడా ఓ సారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది' అని పాకిస్తాన్ నేవీకి చెందిన అధికార ప్రతినిథి వెల్లడించారు. భారత్తో ఎలాంటి వైరం పెట్టుకునే ఉద్దేశ్యం తమకు లేదనీ, శాంతియుత ఆలోచనలతోనే తాము ఆ జలాంతర్గామిని టార్గెట్ చేయలేదని తెలిపారాయన. గతంలో, అంటే 2016లో ఇలాంటి ఘటన జరిగింది. ఇదిలా వుంటే, భారత నావికా దళం, పాకిస్తాన్ ఆరోపణల్ని తిప్పికొట్టింది. అలాంటి ఘటన ఏదీ జరగలేదని పేర్కొంది.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









