నేడు చివరిసారిగా కేబినెట్ భేటి నిర్వహించనున్న మోదీ
- March 07, 2019
న్యూఢిల్లీ: త్వరలోనే లోక్ సభ ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చివరిసారిగా సమావేశం కానుంది. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల రోస్టర్ విధానంలో పాత పద్ధతి పునరుద్ధరణకు సంబంధించిన అంశంపై ఇవాళ ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఉన్నతా విద్యాసంస్థల్లో విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన 10% కోటాను అమలు చేసేందుకు రూ.4000 కోట్లు అదనంగా కేటాయించే ఫైలుపై సైతం నేడు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు సమాచారం. అయితే, అదే సమయంలో ఈ 10% కోటా కారణంగా ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల కోటాపై ఎలాంటి ప్రభావం పడకుండా వుండేందుకు అదనంగా మరో 25% సీట్లు కొత్తగా పెంచనున్నట్టు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
ఇదిలావుంటే, గడిచిన ఐదేళ్లలో భారతీయ రైల్వే సాధించిన పురోగతిపై సమీక్ష నిర్వహించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణకు ఓ రోడ్ మ్యాప్ రూపొందించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పీయుష్ గోయల్ ఓ సమావేశం నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







