జయలలితను 'హల్వా'తో చంపేశారు, సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే తెలుస్తుంది: సీవీ షణ్ముగం
- March 07, 2019
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హల్వా ఇచ్చి చంపేశారంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. అన్నాడీఎంకే తరఫున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ప్రత్యేక అతిథిగా ఆయన పాల్గొన్న ఆయన ఈ ఆరోపణ చేశారు. దీంతో జయలలిత అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. దీంతో జయలలిత మృతిపై ఆయన మరో కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారు. జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు వెళ్తే సాధ్యపడలేదని మంత్రి తెలిపారు. అంతేకాక శశికళే తమను ఆసుపత్రిలోకి అనుమతించలేదని ఆయన ఆరోపించారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తెలిసి కూడా ఆమెకు హల్వా ఇచ్చారు. ఈ విధంగా ఆమె వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఇలా ప్లాన్ చేశారంటూ ఆయన ఆరోపించారు. కార్డియాక్ అరెస్ట్ వస్తే ఆస్పత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జయలలిత కోలుకుంటుందని తెలిపినప్పుడు వెంటనే ఎలా కార్డియాక్ అరెస్ట్ రాగలదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే వాటంతట అవి అసలు నిజాలు బయటకు వస్తాయని మంత్రి సీవీ షణ్ముగం తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!