జయలలితను 'హల్వా'తో చంపేశారు, సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే తెలుస్తుంది: సీవీ షణ్ముగం
- March 07, 2019
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హల్వా ఇచ్చి చంపేశారంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. అన్నాడీఎంకే తరఫున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ప్రత్యేక అతిథిగా ఆయన పాల్గొన్న ఆయన ఈ ఆరోపణ చేశారు. దీంతో జయలలిత అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. దీంతో జయలలిత మృతిపై ఆయన మరో కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారు. జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు వెళ్తే సాధ్యపడలేదని మంత్రి తెలిపారు. అంతేకాక శశికళే తమను ఆసుపత్రిలోకి అనుమతించలేదని ఆయన ఆరోపించారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తెలిసి కూడా ఆమెకు హల్వా ఇచ్చారు. ఈ విధంగా ఆమె వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఇలా ప్లాన్ చేశారంటూ ఆయన ఆరోపించారు. కార్డియాక్ అరెస్ట్ వస్తే ఆస్పత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జయలలిత కోలుకుంటుందని తెలిపినప్పుడు వెంటనే ఎలా కార్డియాక్ అరెస్ట్ రాగలదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే వాటంతట అవి అసలు నిజాలు బయటకు వస్తాయని మంత్రి సీవీ షణ్ముగం తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







