జయలలితను 'హల్వా'తో చంపేశారు, సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే తెలుస్తుంది: సీవీ షణ్ముగం
- March 07, 2019
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హల్వా ఇచ్చి చంపేశారంటూ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. అన్నాడీఎంకే తరఫున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో ప్రత్యేక అతిథిగా ఆయన పాల్గొన్న ఆయన ఈ ఆరోపణ చేశారు. దీంతో జయలలిత అభిమానులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. దీంతో జయలలిత మృతిపై ఆయన మరో కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చారు. జయలలితను అపోలో ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమెను చూసేందుకు వెళ్తే సాధ్యపడలేదని మంత్రి తెలిపారు. అంతేకాక శశికళే తమను ఆసుపత్రిలోకి అనుమతించలేదని ఆయన ఆరోపించారు. జయలలిత మధుమేహంతో బాధ పడుతున్న విషయం తెలిసి కూడా ఆమెకు హల్వా ఇచ్చారు. ఈ విధంగా ఆమె వ్యాధి ముదిరి సహజంగా మరణించాలనే ఇలా ప్లాన్ చేశారంటూ ఆయన ఆరోపించారు. కార్డియాక్ అరెస్ట్ వస్తే ఆస్పత్రి వరండాలో రక్తం ఎలా చిందిందని? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జయలలిత కోలుకుంటుందని తెలిపినప్పుడు వెంటనే ఎలా కార్డియాక్ అరెస్ట్ రాగలదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే సరైన విధంగా శశికళను ప్రశ్నిస్తే వాటంతట అవి అసలు నిజాలు బయటకు వస్తాయని మంత్రి సీవీ షణ్ముగం తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి
- ముంబయిలో 'తెలుగు భవనం' ఏర్పాటుకు కృషి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్లోని స్పా సెంటర్లపై పోలీసుల మెరుపు దాడి
- భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ప్రారంభం..
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ









