సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

- December 29, 2015 , by Maagulf
సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

 అమరావతి టౌన్‌షిప్‌లో సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని 20 ఎకరాల విస్తీర్ణంలో సచివాలయ భవనం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. రూ.180 కోట్లతో 6 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో సచివాలయం నిర్మించాలని సీఆర్‌డీఏను ఆదేశించింది. ఇందులో రూ.90 కోట్లు ప్రభుత్వ వడ్డీ లేని రుణం, రూ.90 కోట్లు హడ్కో రుణంగా ప్రభుత్వం పేర్కొంది. జూన్‌ 30 లోపు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com