అమెరికాల్లోి పలు ప్రాంతాలపై బలమైన టోర్నడోలు తుఫానులు ప్రతాపం..
- December 29, 2015
వాషింగ్టన్: అమెరికాను వరదలు, టోర్నడోలు కకలావికలం చేస్తున్నాయి. తీవ్రమైన టోర్నడోల వల్ల డల్లాస్ ప్రాంతంలో కనీసం 11 మంది మృతి చెందారు. చాలామంది గాయపడ్డారు. దక్షిణ, మధ్య అమెరికాల్లోి పలు ప్రాంతాలపై బలమైన టోర్నడోలు, తుఫానులు ప్రతాపం చూపిస్తున్నాయి. మిడ్ వెస్ట్లో వరదల వల్ల మరో పన్నెండు మంది మృతి చెందారు. డల్లాస్, కొలిన్, ఇల్లిస్ నగరాలపై తుఫానులు ప్రభావం చూపిస్తున్నాయి. డల్లాస్లో కొన్ని ఇళ్లు, వాహనాలు, విద్యుత్తు స్తంభాలు ధ్వంసమయ్యాయి. తూర్పు ఇల్లిస్ వైపు ఓ బలమైన టోర్నడో దూసుకొచ్చింది. డల్లాస్ నగరంలో ఇండ్లు నేలమట్టమయ్యాయని, వాహనాలు కొట్టుకుపోయాయని, విద్యుత్ వైర్లు తెగిపోయాయని, చెట్లు విరిగిపడ్డాయని, దాదాపు నలభై కిలోమీటర్ల మేర నష్టం జరిగిందని, అధికారులు తెలిపారు. గంటకు 166 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. కాగా, టోర్నడోలు, వరదల వల్ల అమెరికాలో మంగళవారం వరకు 44 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఏడు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సోమవారం నాడు 2,100 విమానాలు రద్దు కాగా, 3,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









