రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వివరాలు..
- March 09, 2019
తెలంగాణ:పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధిక సీట్లు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలోభాగంగా ఆయన నాందేడ్ నుంచి బైంసాకు రానున్నారు.
శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న మొదటి సభ కాగా అసెంబ్లీ ఎన్నికల తరువాత రాహుల్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఇక రేపు శంషాబాద్ లోని ఓ హోటల్ లో పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సుమారు గంట సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. రాహుల్ పర్యటన కాంగ్రెస్ కేడర్లో ఉత్సహం నింపుతుంది అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









