రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వివరాలు..
- March 09, 2019
తెలంగాణ:పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధిక సీట్లు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలోభాగంగా ఆయన నాందేడ్ నుంచి బైంసాకు రానున్నారు.
శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న మొదటి సభ కాగా అసెంబ్లీ ఎన్నికల తరువాత రాహుల్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఇక రేపు శంషాబాద్ లోని ఓ హోటల్ లో పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సుమారు గంట సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. రాహుల్ పర్యటన కాంగ్రెస్ కేడర్లో ఉత్సహం నింపుతుంది అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









