హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- June 17, 2026
మస్కట్: హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రత బలోపేతం కోసం ఒమన్ కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ స్పష్టం చేశారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీలో టెలిఫోన్ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా మంచి పొరుగు సంబంధాలను కొనసాగించాలని, ప్రాంత ప్రజలను ఏకం చేసే చారిత్రక, సాంస్కృతిక బంధాల ఆధారంగా వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఉమ్మడిగా నిబద్ధతతో కృషి చేయాలని నిర్ణయించారు.
ఇటీవల కుదిరిన యూఎస్-ఇరాన్ అవగాహనల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన మరియు స్వేచ్ఛాయుతమైన సముద్రయానానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టానికి తమ దేశాలు కట్టుబడి ఉంటామని ఇద్దరు మంత్రులు పునరుద్ఘాటించారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుతూ నిర్మాణాత్మక రాజకీయ, దౌత్య మార్గానికి అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు రాబోయే కాలంలో అన్ని పక్షాలు తీవ్రమైన, నిరంతర ప్రయత్నాలు చేస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!
- దుబాయ్లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!









