జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!

- June 17, 2026 , by Maagulf
జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!

దోహా: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జూన్ 19న జరగనున్న అమెరికా మరియు ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) సంతకాల కార్యక్రమంలో ఖతార్ ప్రాతినిధ్యం వహించనుందని ప్రధాన మంత్రి సలహాదారు మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మాజెద్ బిన్ మహమ్మద్ అల్ అన్సారీ వెల్లడించారు.  

పాకిస్థాన్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు ఖతార్ మద్దతు ఇచ్చిందని డాక్టర్ అల్ అన్సారీ గుర్తుచేశారు. హార్ముజ్ జలసంధి గుండా సాధారణ నౌకాయానాన్ని పునరుద్ధరించడం, కాల్పుల విరమణను కొనసాగించడం మరియు అమెరికా-ఇరాన్ మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లడం వంటి ప్రయత్నాలపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.  అణ్వాయుధాల అంశంతోపాటు ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com