'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు క్లియరెన్స్ ఇచ్చిన నందమూరి ఫ్యామిలీ!
- March 11, 2019
వచ్చేవారం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ సెన్సారింగ్ కార్యక్రమాలు మరొక రెండు మూడు రోజులలో పూర్తి అయ్యే విధంగా ముందుగానే వర్మ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సెన్సార్ విషయంలో అడ్డంకులు క్రియేట్ చేయాలని అదేవిధంగా ఈమూవీ విడుదలను అడ్డుకుంటూ మన తెలుగు రాష్ట్రాలలోని హైకోర్ట్లులలో పిల్స్ వేయాలి అన్న ఆలోచనలు చేసిన నందమూరి ఫ్యామిలీలో మార్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి వర్మ తీస్తున్న కథ లక్ష్మి పార్వతి జీవితం చుట్టూ అల్లబడిన ఎన్టీఆర్ చివరిరోజుల జీవితానికి సంబంధించిన కథ కాబట్టి ఆమె అభ్యంతరాలు చెప్పకుండా కేవలం నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అభ్యంతరాలు చెపితే ఎంత వరకు కోర్ట్ అంగీకరిస్తుంది అన్న సందేహాలు న్యాయనిపుణులు కూడ నందమూరి ఫ్యామిలీ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. దీనితో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఆపుచేయమని ఆవేశంగా కోర్ట్ కు వెళ్లి అక్కడ తమ వాదన నెగ్గకపోతే అది మరింత అవమానంగా ఉంటుంది అన్న అభిప్రాయంలో ప్రస్తుతం చాలామంది నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నట్లు టాక్.
దీనికితోడు ఎన్నికలు కేవలం ఒక నెలరోజులు కూడ లేని నేపధ్యంలో వర్మ గురించి అదేవిధంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ గురించి ఎక్కువగా పట్టించుకోవడం మంచిది కాదని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీని టార్గెట్ చేస్తూ ఎటువంటి లీగల్ ఆలోచనలు చేయవద్దనీ నందమూరి కుటుంబానికి తెలుగుదేశం అధినాయకత్వం నుండి స్పష్టమైన సలహాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఎటువంటి సమస్యలు సృష్టించకుండా వర్మను కూల్ గా వదిలివేయడం మంచిది అనీ లేకుంటే వర్మ ఎన్నికల వేళ నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వస్తే ఈ ఎన్నికల సమయంలో నందమూరి కుటుంబం పై ఏర్పడే నెగిటివ్ ఫీలింగ్ తెలుగుదేశం పార్టీకి చాల కీడు చేస్తుందని తెలుగుదేశంలోని కొందరు కీలక నాయకులు ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు టాక్. దీనికితోడు కేవలం హడావిడి తప్ప వర్మ ఈమూవీలో అందరికీ తెలిసిన విషయాలే పేర్లు మార్చి మళ్ళీమళ్ళీ చెపుతున్న నేపధ్యంలో ఈమూవీ విషయంలో ఆందోళన పడటం కంటే పట్టించుకోకుండా ఉండే స్ట్రాటజీ అనుసరిస్తే తమకు అన్నివిధాల మంచిది అన్న నిర్ణయానికి నందమూరి ఫ్యామిలీ వచ్చిన నేపధ్యంలో ఈమూవీ విషయంలో వర్మ కోరుకునే ఫ్రీ పబ్లిసిటీ పోయిందనే అనుకోవాలి..
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









