కొలంబియా:ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి..
- March 11, 2019
కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 14 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తరైరా, డోరిస్ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.1930లో అమెరికాలో తయారైన డగ్లస్ డీసీ–3 విమానం శాన్ జోస్ డెల్ గ్వావియేర్, విల్లావిసెన్సియో పట్టణాల మధ్య కూలిపోయిందని కొలంబియా విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
కాగా ప్రమాదానికి విమాన ఇంజిన్ వైఫల్యమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతుంటే.. ప్రమాదానికి గల కారణాలు మాత్రం కొలంబియా పౌర విమానయాన సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని కాంట్రాక్టు పద్దతిలో నిర్వహిస్తున్న లాజార్ ఏరియో కంపెనీ ప్రమాదంపై స్పందించడానికి నిరాకరించింది. విమాన ప్రమాద ఘటనపై అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







