కొలంబియా:ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి..
- March 11, 2019
కొలంబియాలో శనివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 14 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తరైరా, డోరిస్ గ్రామాల మేయర్, ఆమె కుటుంబ సభ్యులు, విమాన యజమాని, పైలట్, కో– పైలట్ సహా విమానంలో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.1930లో అమెరికాలో తయారైన డగ్లస్ డీసీ–3 విమానం శాన్ జోస్ డెల్ గ్వావియేర్, విల్లావిసెన్సియో పట్టణాల మధ్య కూలిపోయిందని కొలంబియా విమానయాన శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.
కాగా ప్రమాదానికి విమాన ఇంజిన్ వైఫల్యమే కారణమని నిపుణులు అభిప్రాయపడుతుంటే.. ప్రమాదానికి గల కారణాలు మాత్రం కొలంబియా పౌర విమానయాన సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు ప్రమాదానికి గురైన సమయంలో ఎలాంటి ప్రతికూల వాతావరణం లేదని అధికారులు గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని కాంట్రాక్టు పద్దతిలో నిర్వహిస్తున్న లాజార్ ఏరియో కంపెనీ ప్రమాదంపై స్పందించడానికి నిరాకరించింది. విమాన ప్రమాద ఘటనపై అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









